|
తమిళ అసెంబ్లీలో
తెలుగు ఘోష!
తమిళనాడులో తమిళ మాధ్యమంలోనే విద్యాబొధన జరగాలని ప్రభుత్వం ఆదేశించడం వల్ల తన నియోజక వర్గంలో ఉన్న లక్షమందికిపైగా ఉన్న తెలుగు విద్యార్థులు తీవ్ర ఇబ్బందుల
పాలవుతున్నారని హోసూరు ఎమ్.ఎల్.ఎ. కె. గోపీనాథ్ అసెంబ్లీ దృష్టికి తీసుకు వచ్చారు. తెలుగు విద్యార్థుల కష్టాలను ఆయన కన్నీళ్ళతో వివరించారు. ఆయన ఆవేదనను గమనించిన
మంత్రి తెన్నరసు కల్పించుకుని ఈ విషయంలో తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
|